ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చిక్కులో పడ్డారు పవన్ కళ్యాణ్.
తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో… నోటికి వచ్చినట్లు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కోర్టుకు సమాధానం చెప్పాల్సి వచ్చింది.
తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు పంపింది. జనవరి మాసంలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డుల్లో కల్తీ నెయ్యి వాడినట్లు గతంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… వ్యాఖ్యల నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని…. లాయర్ ఇమ్మినేని రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు పవన్ కళ్యాణ్ కు నోటీసులు పంపింది.
తిరుమల లడ్డు తయారీలో జంతు కొవ్వు పదార్థాలు కల్పినట్లు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు… నోటీసులు పంపింది కోర్టు. నవంబర్ 22వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని… తెలంగాణ సి ఎస్ శాంతి కుమారి అలాగే పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చింది కోర్ట్. అయితే కోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.