దత్తిరాజేరు, బాడంగి మండలాలకు త్రాగునీరు అందించే రక్షిత నీటి పథకాన్ని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత గురువారం తనిఖీ చేశారు.ఈ పథకం నుంచి నీటి సరఫరాపై ఆరా తీశారు. బుధవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బాడంగి జెడ్పిటిసి సభ్యులు లేవనెత్తిన త్రాగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్ స్పందిస్తూ, ఈ పథకాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కవిత ఈ పథకాన్ని గురువారం పరిశీలించారు. బాడంగి మండలంలోని వేగావతి నదిపై పాల్తేరు గ్రామం వద్ద ఉన్న ఊటబావుల నుంచి బాడంగి, దత్తిరాజేరు మండలాల్లోని 68 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. ఈ పథకం సక్రమంగానే పనిచేస్తోందని, ఎటువంటి అంతరాయం లేదని ఆమె తెలిపారు. మొత్తం 68 గ్రామాలకు త్రాగునీటి సరఫరా జరుగుతోందని ఎస్ఈ స్పష్టం చేశారు.
త్రాగునీటి పథకాన్ని పరిశీలించిన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ
0
12
RELATED ARTICLES
- Advertisment -