మండలంలో బరడ నుంచి లక్ష్మీపురం పంచాయతీ కేంద్రానికి వెళ్లే మార్గం మధ్యలో గల డైనిజోల సమీపంలో ప్రధాన రహదారిపైనేల మట్టమైన కల్వర్టు . దీంతో బరడ, బుంగాపుట్టు, లక్ష్మీపురం పంచాయతీల తో పాటు ఒడిశాకు చెందిన సుమారు 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఈ రహదారే ఆధారం. వాహన రాకపోకలు స్తంభించి పోవడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే ఇసుక లోడుతో అటుగా వెళుతున్న టిప్పర్ లారీ కల్వర్టు దాటుతున్న సమయంలో వాహనం బరువుకు కల్వర్టు నేల మట్టమయింది. లారీ పక్కకు ఒరిగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ కల్వర్టు కాలం చెల్లిపోవడంతో పాటు జీవం కోల్పోయింది. ఈ మార్గంలో పలుచోట్ల పలు కల్వర్టులు ఇదే పరిస్థితి నెలకొంది. ఆ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఆ ప్రాంతీయులు తీసుకువెళ్లారు. అయినా ఫలితం కాన రాలేదు. కల్వర్టు కూలిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అటుగా ద్విచక్ర వాహనం సైతం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే పలు గ్రామాల ప్రజలు 108 అత్యవసర సేవలకు సైతం దూరం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి కాలం చెల్లిపోయిన కల్వర్టులను గుర్తించి వాటి స్థానంలో నూతన కల్వర్టులు నిర్మాణం చేపట్టాలని ఆ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
50 గ్రామాలకు నిలిచిన వాహన రాకపోకలు!
0
50
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -