అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు (జయ జయహే):పాడేరు మండలం కోర్ కమిటీ ఆధ్వర్యంలో 26 పంచాయితీలు 16 ఎంపీటీసీలకు సంబంధించి సుదీర్ఘమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా!! వంపూరు గంగులయ్య హాజరయ్యారు ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు గెలుపే లక్ష్యంగా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు…కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరపున గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించాలని, కోర్ కమిటీ కోరగా అందుకు తగ్గ అభ్యర్ధులను గుర్తించే ఆలోచన చేస్తున్నామన్నారు… అందులో భాగంగా పాడేరు మండలం కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది… ఈ సందర్భంగా కోర్ కమిటీ సభ్యులు వివిధ సూచనాలతో ప్రతిపాదనలు చేయడం జరిగింది… కొన్ని పంచాయతీల అభ్యర్ధుల విషయంలో కమిటీను ఏర్పాటు చేసి అభ్యర్ధుల స్తితిగతులు గెలుపు అవకాశాలపై పరిస్థితులు అదేవిధంగా పోటీకి ఆసక్తి చూపిస్తున్న అభ్యర్ధుల గుణగణాలు వాళ్లకు సంబంధించిన గెలుపు అవకాశాలపై అధ్యాయనం చెయ్యాలని ఆలోచన చెయ్యడం జరిగింది… రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ పావులు కదుపుతుంది.. దాంట్లో భాగంగా ఈ రోజు పాడేరు మండలంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది… స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి శ్రేణులతో కలిసి జనసేన శ్రేణులు గెలుపే లక్ష్యంగా బలంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు… ఈ సమావేశంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి బొంకుల.దివ్యలత, పాడేరు మండల అధ్యక్షులు నందోలి. మురళి కృష్ణ , పాడేరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పాంగి. శివాజీ,పి.ఏ.సీఎస్.డైరెక్టర్ వంపూరు. రమేష్, పాడేరు మండల ఉపాధ్యక్షులు సీసాల. భూపాల్, పాడేరు మండల నాయకులు కుంచె. దేవేంద్ర ప్రసాద్, లంకెల. పవన్ తేజ్, బడ్నేని. అప్పలరాజు, జంగేడి. ఈశ్వరరావు, బర్జ.నాగేశ్వరరావు, మజ్జి. రవి కుమార్, సమర్బ శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు
కోర్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన వంపూరు గంగులయ్య.
Date:

