ప్రస్తుత పండుగ సీజన్ తొలి విడుతలో కంపెనీ మొబైళ్లకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సీజన్లో అమ్ముడైన ఫోన్లలో 20 శాతం మార్కెట్ వాటాతో సామ్సంగ్ తొలిస్థానంలో నిలిచిందని టెక్ ఇన్సైట్స్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అలాగే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు కేవలం 11 రోజుల్లోనే 10 లక్షలకు పైగా ఐఫోన్లు కొనుగోలు చేశా రు. అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో గెలాక్సీ ఎం35, గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఏ14, గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈలు ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్కార్ట్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించగా, అమెజాన్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో ఆఫర్లను తీసుకొచ్చాయి.టాటా టెక్నాలజీస్, బీఎండబ్ల్యూ గ్రూప్ జట్టు కట్టాయి. మంగళవారం తమ జాయింట్ వెంచర్ (జేవీ)ను అధికారికంగా ప్రకటించాయి. బీఎండబ్ల్యూ టెక్వర్క్స్ ఇండియా పేరిట ఈ జేవీని తెచ్చారు. సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికిల్స్ (ఎస్డీవీ)సహా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఐటీ వ్యాపారం కోసం డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ను ఇది అభివృద్ధి చేయనున్నది. కాగా, 100 మంది ఉద్యోగులతో ఇది మొదలు కానున్నది. పుణె, బెంగళూరు, చెన్నై ఆధారంగా కార్యకలాపాలు సాగుతాయి.
ఎఫ్ఎంసీజీపై పామాయిల్ పిడుగు
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న పామాయిల్ ధరలు దేశీయ ఎఫ్ఎంసీజీ రంగ సంస్థల లాభాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆయా సంస్థల లాభాలు భారీగా తగ్గే అవకాశాలున్నాయని సర్వే వెల్లడించింది. ఒకవైపు పామాయిలు ధరలు, మరోవైపు ఉత్పత్తి వ్యయం, ప్రకటనలకోసం అధికంగా నిధులు వెచ్చించడంతో మార్జిన్లు, లాభాలపై ప్రతికూల ప్రభావం పడనున్నది. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్, మారికోలు తమ లాభాలు ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.