ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. పారిశుద్ధ్యం నిర్వహణపై మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో ఉదయం వేళల్లో వార్డుల్లో పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తానని వెల్లడించారు. జీవీఎంసీ 6 వ వార్డులో రూ. 66.45 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు, సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్, కల్వర్టు, సామాజిక భవనం ప్రహరీ గోడ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం అభివృద్ధిపై ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధ్యక్షతన ఈనెల 25 న సమావేశం నిర్వహిస్తున్నామని, జిల్లా అధికారులందరూ ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధిపై ఇలాంటి సమావేశాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం కావడం, భీమిలికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. జోనల్ స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహించి, పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగాల కోసం చదువుకున్న యువత వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా విశాఖలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. తన హయాంలో నిర్మాణం ప్రారంభించిన కళ్యాణ మండపాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, సగం పూర్తయిన దీన్ని రూ.80 లక్షల అంచనాతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఏ అంచనాలతో తనను భారీ మెజారిటీతో గెలిపించారో అభివృద్ధి చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. అయిదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉన్న జీవీఎంసీ వార్డుల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 6 వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సింహాచలం నాయుడు, కూటమి నేతలు కోరాడ రాజబాబు, కె.రామానాయుడు, శాఖారి శ్రీనివాస్, మొల్లి లక్ష్మణరావు, మన్యాల సోంబాబు, గరే గుర్నాథ్, వాండ్రాసి అప్పలరాజు, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
స్వయంగా పర్యవేక్షిస్థానన్న ‘గంటా’
0
35
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -