- దిగ్గజ మ్యూచువల్ ఫండ్ సంస్థ.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొద్ది రోజుల కిందట ఎస్బీఐ నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్ లాంఛ్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లోని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇలా అన్ని రంగాల స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. దీంతో వైవిధ్యత ఉండి మంచి రిటర్న్స్కు అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్లలో ఉన్న ప్రత్యేకతే ఇది. స్టాక్ మార్కెట్లో అయితే కేవలం ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా హెచ్చుతగ్గుల్ని బట్టి లాభనష్టాలు వస్తుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్లలో అయితే.. ఒకే మ్యూచువల్ ఫండ్ పథకం ద్వారా పలు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వీలుంటుంది. ఇక్కడ సమతుల్యత పాటించొచ్చన్నమాట. ఒక దాంట్లో నష్టమొచ్చినా.. మరో దానితో దీనిని పూడ్చుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త పథకం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.