Tuesday, June 17, 2025
HomeGovernmentసుుప్రీం చీఫ్ గా సంజీవ్ ఖన్నా

సుుప్రీం చీఫ్ గా సంజీవ్ ఖన్నా

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (65) పదవీ విరమణ చేసిన మరుసటి రోజున, అంటే, నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు కొత్త సీజేఐ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ 2022 నవంబర్ 8న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. సీజేఐగా జస్టిస్ ఖన్నా పదవీకాలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమితులైన విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ యిటీవల వెల్లడించారు. ‘‘భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని ఉపయోగించి, గౌరవనీయులైన రాష్ట్రపతి, గౌరవనీయ భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల తరువాత, 2024 నవంబర్ 11 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించడం సంతోషంగా ఉంది’’ అని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments