Tuesday, June 17, 2025
HomePOLITICSరూ.1.6 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన గంటా

రూ.1.6 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన గంటా

ఆర్థిక రాజధాని విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. భీమిలి మండలంలో రూ.1.6 కోట్లతో చేపట్టనున్న ఉపాధి హామీ పథకం పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం సింగనబందలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐటీ, టూరిజం, విమానయాన రంగాల్లో యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. టీసీఎస్ లో 10 వేల ఉద్యోగాలు అనేది రాష్ట్ర ప్రభుత్వ విజయమని పేర్కొన్నారు. 2014-19 లో రూ.3,800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ఈసారి అంతకు మించిన అభివృద్ధితో ప్రజల మన్ననలు పొందుతానని హామీ ఇచ్చారు. భీమిలి టికెట్ తనకు ఆఖరి నిమిషంలో ప్రకటించడంతో కేవలం 20 రోజులే ప్రచారం చేసినప్పటికీ, ఎంతో అభిమానంతో 92,401 ఓట్ల మెజారిటీ ఇచ్చారని కృతజ్ఞతలు తెలియజేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పారు. అంతకుముందు రూ.50 లక్షలతో తాటితూరులో, రూ. 40 లక్షలతో సింగనబందలో, రూ.50 లక్షలతో లక్ష్మీపురంలో, రూ.20 లక్షలతో టి.నగరంపాలెంలో రిటైనింగ్ గోడ, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భీమిలి జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోరాడ రాజబాబు, డి.ఎ.ఎన్.రాజు, గంటా నూకరాజు, కొప్పల రమేష్, చందక అప్పలరాజు, శరగడ అప్పారావు, కంది రమణ, ఎంపీడీఓ హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments