Tuesday, June 17, 2025
HomePOLITICSనమో -జగన్మోహనా...

నమో -జగన్మోహనా…

2019 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రం లో అన్ని పార్టీలు విడివిడిగా పోటీచేసాయి టీడీపీ కి మాత్రమే 23 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి..వైసీపీ మాత్రం తిరుగులేని మెజార్టీ స్థానాలు సంపాదించుకుంది .అత్యధిక పార్లమెంటు స్థానాలు కూడా సంపాదించుకుంది.ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండానే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది.ప్రాంతీయ పార్టీల అవసరం పెద్దగా లేకపోయింది.2019 లో విడివిడిగా పోటీ చేసినప్పుడు బీజేపీ మాత్రం అనధికారికంగా వైసీపీకి మద్దతు పలికింది.ఒకవేళ రాష్ట్రములో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాడు నరేంద్రమోడీ (నమో).సరే సర్ అన్నాడు జగన్మోహన్, నమో జగన్ను ముద్దుగా పిలిచే పేరు (జగన్మోహన్) నమోకి జగన్ తో అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పడింది.అయితే వైసీపీ ఎన్డీయే కూటమిలో బహిరంగంగా చేరకపోయినా పార్లమెంటులులో ప్రవేశపెట్టే అన్నికాల బిల్లులకు మద్దతు పలికింది. వైసీపీ అందుకుఅనుగుణంగానే మోడీ కూడా జగన్ను జాగర్తగా చూసుకున్నారు. ప్రస్తుతం కూటమిలో ప్రభుత్వంలో ఉన్న పార్టీలు జనసేన టీడీపీ లు ఎన్ని విమర్శలు చేసినా నమో మాత్రం మనసులో ఉన్న జగన్ని ఒక్కమాటకూడా అనలేదు.

జగన్ మోడీ మనసులో పదిలంగా ఉన్నాడని గ్రహించిన జనసేన,టీడీపీలకు నేటికీ మింగుడు పడటంలేదనిపిస్తోంది.కూటమిలో ఉన్నారనే మాటేగాని ఒకరి పై మరొకరికి అపనమ్మకాలు ఎక్కువ.మోడీని ఎదురుకోవాలంటే జగన్ని ఏదోకటి చేసేయాలి అది కూడా మోడీతోనే చేయించాలి.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఇద్దరు ఒకేసారి ఆంధ్రాలోలో ఒంటరిగా మిగిలిపోవాలి ఆలా జరిగితేనే మనకు భవిష్యత్తు అన్నట్టుగా ఉన్నారు టీడీపీ,జనసేన.

జగన్ మీద విచారణను ప్రధానిపై బాబు చేస్తున్న రాజకీయ వ్యూహాత్మక ఒత్తిడి

జగన్మోహ రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీకి స్నేహం ఉన్నట్లయితే ఎలాంటి రాజకీయ వ్యూహంన్నైనా ఇద్దరిని వేరుచేయాలి అనే ఆలోచనలో టీడీపీ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు వంటి రాజకీయ పరిజ్ఞానము లేదు, ఆవేశపూరితమయిన ప్రసంగాలు తప్ప ఎదుటి పార్టీల వ్యూహాలు పసిగట్టి తిప్పికొట్టే రాజకీయ చాణక్యం మాత్రం లేదు. జగన్ ను రాజాకీయా నుండి పూర్తిగా నిలువరించాలంటే అది కోర్టుల ద్వారానే సాధ్యం అని నమ్మిన చంద్రబాబు తన ప్రాబల్యాన్ని అంతా ఉపయోగించి తన అనుచరులతో కింద కోర్టు నుండి సర్వోన్నత న్యాయస్థానం వరుకు అన్ని కోర్టులలోను జగన్ కేసులు వేసి జగన్ కేసులు త్వరగా విచార జరపాలని పిటిషను మీద పిటిషను వేస్తున్నారు. వేసిన పిటిషన్లు కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు.అనుకున్న కోర్టు వ్యూహం చెడింది. కోర్టులు ద్వారా సిబిఐ ,ఇడిలను ఆదేశించలేకపోయాము. ఏం చేయాలనీ సుదీర్ఘంగా ఆలోచించి వెంటనే పార్టీ పార్లమెంట్ సభ్యులను పిలిచి సుదీర్ఘ చర్చలు జరిపి మనం మనుగడ సాధించాలంటే మోడీ కి జగన్ కి మధ్యలో బలమయి రహస్య బంధం తెగ తెంపులు చేయాలి.దానికి మన ముందు ఉన్నది ఒక్కటే మార్గం అది పార్లమెంట్ మాత్రమే.జగన్ పై ఉన్న కేసును విచారించడం లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు విఫలమయ్యాయని సభలో బల్లగుద్ది మరి ప్రసంగం సాగించండి .జగన్ లాంటి ఆర్ధిక ఉగ్రవాదులను రాజకీయాలలో ఉండకూడదని,ఇలాంటి వారు దేశానికి కూడా ప్రమాదమని అరచి గోల గోల చేయండి మీ వాదనలకు సభలో కూర్చున్న ప్రధాని మోడీ హోమ్ మంత్రి అమిత్ షా చెవులు రింగుమనాలి అని అని పార్లమెంట్ సభ్యులకు ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.వెంటనే అమ్మోరు పూనినట్టు పార్టీ పార్లమెంటు సభ్యులు సభలో ఊగిపోయారు కానీ కేంద్ర పెద్దలు గావు కేకలను పెద్దగా పట్టించుకోలేదు.వెంటనే మరో ఆలోచన చేసేవారు ముఖ్యమంత్రి హోదాలో జగన్ మద్యం స్కామ్ చేసి వేలకోట్లు తినేసాడు ఇది అతి పెద్ద నేరం వెంటనే సిబిఐ తో విచారణ చేయించండి అని టీడీపీ పార్లమెంటు పార్టీ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణ దేవరాయలు తో పెద్ద లేఖ రాయించి హోమ్ మంత్రి అమిత్ షా కు పిర్యాదు చేయించారు చంద్రబాబు. ఆలేఖను ను బుట్టలో పడేసారు అమిత్ షా.

చంద్రబాబు రాజకీయ వ్యూహాలపై బీజేపీ అభిప్రాయం ఏంటి

దేశ ప్రదాని నరేంద్రమోడీ,ఆంధ్రపప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయనాయకులు జాతీయ పార్టీ బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి దేశప్రధాని అయ్యారు మోడీ ,కార్యకర్త స్థాయినుండి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి రెండుసార్లు విడిపోయిన రాష్ట్రానికి ప్రస్తుతం రెండోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు.ఇలాంటి వారు అదే రాజకీయ చదరంగం మంచి రసకందాయంలో ఉంటుంది 2014 లో కలిసి పోటీ చేసి 18 నాటికి బద్ద రాజకీయ శత్రువులుగా మారిపోయారు. చంద్రబాబు పెద్ద అవినీతి పరుడని ఆయనకు రాష్ట్ర అభివృద్ధి కన్నా కొడుకు అభివృద్ధి ముఖ్యమని మోడీ విమర్శించారు. మోడీ పెద్ద ఉగ్రవాది అని రాజ్యాంగ సంస్థలన్నిటిని నాశనం చేసారని భార్యనే సరిగా చూడలేనివాడు దేశాన్ని ఏమి కాపాడుతాడని మోడీ హయంలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని బీజేపీ మతతత్వ పార్టీ అని బాబు విమర్శించారు.అంతే కాదు బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా తన కుటుంబ సభ్యులతో వేంకటేశ్వరస్వామి దర్శనం కి వస్తే తిరుగు ప్రయాణంలో అలిపిరి దగ్గర టీడీపీ కార్యకర్తలతో అమిత్ షా కారు డిక్కీ పగలగొట్టించాడు బాబు సంఘటనను ఆంధ్రుల కడుపు మండుతోందని శాసనసభ వేదికగా సమర్ధించుకున్నారు బాబు.అటువంటి తీవ్రమయిన వ్యతిరేక ప్రదర్శించిన బాబుని మోడీ అమిత్షాలు ఎలా నమ్ముతారు గడిచిన సంఘటనలు అంత సునాయాసంగా మరిచిపోదు బీజేపీ కేంద్ర నాయకత్వం.బాబుని నమ్మి జగన్ జోలికి పోరు రాబోయే ఎన్నికలలో ప్రస్తు కూటమికి ఎదురు దెబ్బతగిలితే జగన్ అవసరం తప్పనిసరి సంగతి బీజేపీకి తెలుసు జగన్ తో అవసరం లేకపోయినా నమ్ముతుంది కానీ చంద్రబాబుని మాత్రం మోడీ నెమ్మడు. మోడీ మనసులో జగన్ పదిలం స్థానానికి కదిలించడం ప్రస్తుతం బాబుకి అంత తేలికయిన విషయం కాదు.కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు రాష్ట్రానికి అంతమేలు చేసేవి కావు రాజకీయాలు, వేధింపుల ధోరణి తగ్గించి కేంద్రము నుండి రాష్ట్రానికి రావలసిన వాటాలను సాదిస్తారని ఆశిద్దాము.

మధు భోజంకి

9493380080

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments