పెందుర్తి : జయజయహే : పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి పంచకర్ల ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్న సీనియర్ నాయకులు బెహర భాస్కర రావు మరియు కార్పొరేటర్లు జీవీఎంసీ అవిశ్వాసంలో కూటమి గెలుపుకు ఫలిస్తున్న జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వ్యూహం
జనసేన పార్టీ లోకి 91 వార్డ్, 92 వార్డ్ కార్పొరేటర్లు
జీవీఎంసీలో అవిశ్వాసం నెగ్గేందుకు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వ్యూహాలు ఫలిస్తున్నాయి. జీవీఎంసీ మేయర్ కూటమి ఖాతాలోకి తీసుకురావడానికి పంచకర్ల కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీ ఇప్పటికే 11 మంది కార్పొరేటర్లు ఉండగా మరో ఇద్దరిని కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేర్చేందుకు సమ్మహాలు చేశారు. గత వైసిపి పార్టీ నుంచి 91వ వార్డ్ బెహరా వెంకట స్వర్ణలత శివ దేవి,92వ వార్డు కార్పొరేటర్ జ్యోత్న్స ,కార్పొరేటర్ గా బెహరా భాస్కరరావు తన సతీమణి కోడలును గెలిపించుకున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జనసేన పార్టీలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమీక్షంలో చేరారు.పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సారధ్యం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్య మంత్రి , జనసేన అధ్యక్షులు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సమక్షం లో జనసేన పార్టీలో త్వరలో చేరనున్నారు. దీంతో జీవీఎంసీ అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీ నెగ్గేందుకు పూర్తి మెజారిటీ వచ్చినట్టే.