రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం సభార్థినేట్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నూతన పాలకవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు.ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారులుగా ఆర్.రామ చంద్ర ప్రసాద్, సహాయ ఎన్నికల అధికారిగా దేవరాపల్లి జగన్నాథరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులతో రాష్ట్ర శాఖ అధ్యక్షులు బి.గోపాల కృష్ణయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ ఎన్నికలలోజిల్లా అధ్యక్షులుగా వి. నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు -1గా సర్వ సిద్ది వెంకట వరహాల బాబు, జిల్లా ఉపాధ్యక్షులు -2గా ఎస్.బేగం, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏ.టి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యాలయ కార్యదర్శిగా కె.వెంకటేశ్వర్లు, జిల్లా సంయుక్త కార్యదర్శిగా
ఎస్. సింహాచలం నాయుడు, జిల్లా కోశాధికారిగా పి. రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు తదితరులు అభినందించారు.
సబార్డినేట్ ఉద్యోగుల నూతన కార్యవర్గం…
RELATED ARTICLES