అరకులోయ: జయ జయహే. : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఏపీ ఎస్ ఎస్ డిసి. ఆర్. ఐ.టి. ఐ కాలేజ్, పాడేరులో అక్టోబర్ 24 (శుక్రవారం నాడు) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 12 కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు డాక్టర్.పి. రోహిణి, జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ, నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్, కేర్ ఫర్ యు, మీ షో వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ .దాని పైన చదువు పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ-యువకులు ఇంటర్వ్యూకు పాన్ కార్డు, ఆధార్ కార్డు. సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹10,000 నుంచి ₹20,000 వరకు జీతం అందించబడుతుందని తెలిపారు.
ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువతీ-యువకులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్.పి. రోహిణి, ఏపీ ఎస్ ఎస్ డిసి జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి కోరారు. మరిన్ని వివరాలకు https://naipunyam.ap.gov.in వెబ్సైట్ లేదా మధు (9177 517373), నవీన్ (7569923256)లను సంప్రదించవచ్చు.
“అరకు వేలి ఆర్. ఐ.టి. ఐ” కళాశాలలో మెగా జాబ్ మేళా
Date:

