విశాఖపట్నం: జయ జయహే: రియల్ ఎస్టేట్ రంగంలో మరో ముందడుగు వేస్తున్న మహా ఎంటర్టైన్మెంట్… వి ఎం ఆర్ డి ఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ చేతులు మీదుగా ఆయన నివాసంలో మహా భూమి ఉత్సవ్ 2025 పోస్టర్ ను ఆవిష్కరించారు.. మహా ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎం.వి. ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విశాఖ జిల్లా శరవేగంగా అబివృద్ధి చెందుతోందని, ఫైనాన్షియల్ క్యాపిటల్ గా పేరు గాంచిన విశాఖ జిల్లాలో భూమి ధర రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని అన్నారు..జిల్లా వాసులకు తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసే అవకాశం మహా భూమి ఉత్సవ్ 2025 ఈవెంట్ ఆర్గనైజర్స్ కల్పిస్తున్నారని అన్నారు.. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మహా భూమి ఉత్సవ పోస్టర్ ఆవిష్కరించిన వి ఎం ఆర్ డి ఏ చైర్మన్
0
13
RELATED ARTICLES
- Advertisment -