గూగుల్లో రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించవ్చని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన విద్యార్థి నుంచి రూ. 1.90 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన విద్యార్థిని (21)కు వాట్స్పలో ఓ సందేశం వచ్చింది. గూగుల్లో రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో ఆన్లైన్ గూగుల్ రేటింగ్ టాస్క్లో చేరింది. టెలిగ్రాం గ్రూపులో యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు. ముందుగా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. పెట్టుబడికి తగిన విధంగా కొద్ది మొత్తాల్లో డబ్బు లాభాలు అంటూ ఇచ్చారు. నమ్మం సాధించిన తర్వాత ఎక్కువ మొత్తంలో లాభాలు రావాలంటే (రెండవ స్టేజ్) బిట్ కాయిన్ ప్రొఫైల్లో జాయిన్ కావాలని సూచించారు.బిట్ కాయిన్ ప్రొఫైల్లో చేరాలంటే రూ. 1.90 లక్షలు పెట్టుబడి పెట్టాలన్నారు. పెట్టుబడి పెట్టి పని చేసిన ఆమెకు మరో స్టెప్ పైకి రావాంటే (పెట్టుబడికి రెట్టింపు) మరికొంత డబ్బు కట్టాలని సూచించారు. కానీ డబ్బు కట్టేందుకు అంగీకరించని యువతి, ఇప్పటి వరకు పెట్టిన తన పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరింది. మూడో స్టేజ్ పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఇవ్వడం కుదరదన్న సైబర్ నేరగాళ్లు మరింత డబ్బు కట్టాలని డిమాండ్ చేశారు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గూగుల్ రేటింగ్లకు డబ్బులంటూ మోసం..
0
33
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -