ఒంటిమిట్ట/ తిరుపతి జయజయహే: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను, పెన్నా సిమెంట్స్ అధినేత శ్రీ ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కూడి శుక్రవారం నాడు విరాళంగా అందించారు. దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.