విప్లవ ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన గద్దర్ ను అభ్యుదయ వాదులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ బహుజన కళామండలి ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం టీ.ఎల్.ఎన్. సభా హాల్ లో ఆదివారం జరిగిన “ప్రజా యుద్ధనౌక గద్దర్ యాదిలో” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గద్దర్ పాటల శైలి జన బాహుళ్యానికి ఎంతో చేరువైందని పేర్కొన్నారు. జీవితమంతా సమాజహితాన్ని కోరుకున్న గద్దర్ ను ఆదర్శంగా తీసుకుని అనేకమంది అభినవ గద్దర్ లు వచ్చారన్నారు. గద్దర్ అడుగుజాడల్లో నడుస్తున్న దేవీశ్రీ వంటి కొత్త తరాన్ని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ నరసింహారావు, జాన్, ప్రేమానందం, ఎన్.విజయ్ మోహన్, గద్దర్ కుమార్తె వెన్నెల, టి.షారోన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
రాజీ లేని విప్లవ యోధుడు గద్దర్
0
33
Previous article
RELATED ARTICLES
- Advertisment -