Tuesday, June 17, 2025
HomeBlogముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో ఆత్మీయ వీడ్కోలు పలికిన అనకాపల్లి ఎం.పీ

ముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో ఆత్మీయ వీడ్కోలు పలికిన అనకాపల్లి ఎం.పీ

అనకాపల్లి : జయజయహే : రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు కడప జిల్లా ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు ప‌లికారు.శుక్రవారం ఒంటిమిట్ట వేదిక‌గా జ‌రిగిన రాములువారి కళ్యాణ ఉత్సవమునుకు స‌తీస‌మేతంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించు కార్యక్రమం లో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయ‌న శనివారం కడప విమానాశ్ర‌యానికి తిరుగు ప‌యనమ‌య్యారు.ఈ సంద‌ర్బంగా అనకాపల్లి ఎం.పీ సి.ఎం రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో కాసేపు ముచ్చటించారు.మంత్రులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి,బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత మరియు ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు ముఖ్యమంత్రి కి ఆత్మీయ వేడుకలు పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments