ఫరీదాబాద్ లో జరిగే ప్రతిష్ఠాత్మకమైన మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల ప్రధానోత్సవానికి ఈసారి విజయవాడ నుండి ప్రముఖ గౌరవ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు ను 15 వ సారి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం విశేషం. మ్యాజిక్ మరియు ఆర్ట్స్ యూనివర్సిటీ మరియు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సంయుక్తంగా ఏప్రిల్ 12 న, శనివారం ఫరీదాబాద్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది. భారతదేశం నలుమూలల నుండి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులు ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరై అవార్డులు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని అధికార అనుమతుల తో, మ్యాజిక్ బుక్ రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ సి.పి. యాదవ్ ఆధ్వర్యంలో, ప్రపంచ ప్రఖ్యాత మెజీషియనే సమక్షంలో నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సుప్రీం కోర్టు న్యాయవాది డాక్టర్ రామ్ అవతార్ శర్మ, వ్యవసాయ జిల్లా అధికారి డాక్టర్ రాజేంద్ర సైనీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు పాల్గొనడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ విషయాన్ని విజయవాడలోని తన కార్యాలయంలో డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు మీడియాకు తెలియజేశారు. మ్యాజిక్ మరియు ఆర్ట్స్ రంగాలలో తన సేవలకు ఈ గుర్తింపు మరోసారి లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిధిగా డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు
0
14
RELATED ARTICLES
- Advertisment -