Tuesday, June 17, 2025
HomeBusinessసామాన్యుల్లో 'పసిడి' గుబులు

సామాన్యుల్లో ‘పసిడి’ గుబులు

ప్రస్తుత పండుగ సీజన్‌లో బంగారం, వెండి దేదీప్యమానంగా మెరుస్తున్నాయి. ఇవి ఎంతగా వెలిగిపోతుంటే, సామాన్యుల ముఖాలు అంతగా వెలవెలబోతున్నాయి. బంగారం, వెండి ఆభరణాలను పక్కనబెడితే, ఒక గ్రాము నాణేలను కొనడం కూడా భారంగా మారింది. 24 కేరెట్ల బిస్కట్‌ బంగారం 10 గ్రాముల రేటు రూ.80,000 (పన్నులు కలిపి) దాటింది, రూ.81,000 వైపు పరుగులు పెడుతోంది. 22 కేరెట్ల ఆర్నమెంట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాములకు రూ.73,000 పైన ఉంది. కిలో వెండి ధర రూ.లక్ష నుంచి కిందకు దిగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రస్తుతం, ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,763 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 430 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 400 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 330 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు ఒకేసారి 2,000 రూపాయలు ఎగబాకింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments