Tuesday, June 17, 2025
HomePOLITICSనోటీసుల వెనుక రాజకీయమా.......?

నోటీసుల వెనుక రాజకీయమా…….?

పొలిటికల్‌ ప్రత్యర్ధులుగా ఉన్న అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ మొదలైంది. తనకు తెలియకుండానే తన కంపెనీ షేర్లు బదలాయించారంటూ తన తల్లి విజయమ్మకు లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో ఆస్తుల పంపకం అగ్రిమెంట్‌ రద్దు చేసుకుందామంటూ షర్మిలకు లేఖ రాయడంతో అంతే ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు జగన్‌ చెల్లెలు. అయితే జగన్‌ నోటీసులు ఇవ్వడం వెనక రాజకీయం ఉందా? పాత కేసుల భయం దాగుందా? షర్మిలతో జగన్‌ చేసుకున్న ఒప్పందం ఏంటి? అన్నదీ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను ఇచ్చిన 1శాతం వాటా గిఫ్ట్‌ డీడ్‌ను తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని, దీనిని రద్దు చేయాలంటూ నేషనల్‌ కంపెనీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు మాజీ సీఎం జగన్‌. సరస్వతీ పవర్‌ కంపెనీలో 99శాతం షేర్లు జగన్‌కూ, 1శాతం షేర్లు విజయమ్మకూ ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈ ఆస్తికూడా అటాచ్‌మెంట్లోకి వెళ్లిపోయింది. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అయితే, తన చెల్లెలపై ప్రేమకొద్దీ రాసిన MOUలో సరస్వతీ సిమెంట్స్‌లో 49శాతం షేర్లు ఇస్తానని జగన్‌ చెప్పారు. నేరుగా షర్మిలకు బదిలీ చట్టవిరుద్ధం కాబట్టి, నమ్మకం కోసం అప్పటికే 1శాతం వాటాదారుగా ఉన్న తల్లికి ఇస్తానన్న ఈ షేర్లపై గిఫ్ట్‌ డీడ్‌ రాసిచ్చారు. కేసులు తేలాక షర్మిల పేరు మీద బదిలీ చేసుకోవచ్చని జగన్‌ ఈ గిఫ్ట్‌డీడ్‌ను 2019లోనే రాసిచ్చారు. అయితే కోర్టు కేసుల్లో, అటాచ్‌మెంట్లో ఉన్న ఆస్తిని నిర్వహించుకోవడానికే తప్ప ఏరకంగానూ క్రయ, విక్రయాలు చేసుకోవడానికి వీల్లేదు. 2021లో సరస్వతీ పవర్‌లో జగన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గరనుంచి షేర్లను బదిలీ చేయించుకున్నారు షర్మిల. కోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం లీగల్‌గా ఇబ్బంది తెచ్చిపెడుతుందని జగన్‌ను న్యాయవాదులు హెచ్చరించారు. దీంతో న్యాయవాదుల సూచనలతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్‌ లీగల్‌గా ఎన్.సీ.ఎల్.టీ. ని ఆశ్రయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments