Tuesday, June 17, 2025
HomeGovernmentడిస్టలరీల్లో సోదాలు....

డిస్టలరీల్లో సోదాలు….

సీఐడీ డిస్టిలరీస్‌పై దండెత్తింది. ఏకకాలంలో 30 చోట్ల 20 బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 6 చోట్ల తనిఖీలు చేపట్టారు. కృష్ణా జిల్లాలో 2 చోట్ల దాడులు చేశారు. ఏలూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విశాఖలోనూ సోదాలు చేపట్టారు. రెండు రోజుల పాటు ఈ దాడులు కొనసాగే ఛాన్స్‌ ఉంది. ప్రభుత్వం ఇటీవలే నూతన ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపధ్యంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అదికూడా ఏకకాలంలో సోదాలు జరగడం హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 2019-24 మధ్య మద్యం అమ్మకాలు, సరఫరాపై సీఐడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తయారైన క్వాంటిటీ, షాపులకు సప్లై అయిన క్వాంటీటీలో తేడాలున్నాయా? ఇప్పటికే డిస్టిలరీలు అనధికారిక మద్యాన్ని సరఫరా చేస్తూ.. వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇక బిల్స్‌ & పేమెంట్స్‌. చెల్లింపుల్లోనూ అవకతవకలు పాల్పడినట్లు సీఐడీకి ఫిర్యాదులు అందాయి. మద్యం నాణ్యతను కూడా సీఐడీ అధికారుల పరిశీలన జరుపుతున్నారు. లిక్కర్‌ క్వాలిటీ శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంత మద్యం తయారు చేశారు..? ఎవరెవరికి పంపించారు..? ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం ఎంత సప్లై అయింది..? అనే విషయాలపై ఆరా, నిల్వల్లో ఏమైనా తేడాలున్నాయా..? అనే అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. అప్పట్లో ఎక్సైజ్ శాఖ వ్యవహారాన్ని నడిపించిన వాసుదేవరెడ్డిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్ ఆదేశాలతో డిస్టిలరీలు, డిపోలు, మద్యం షాపులపై వాసు దేవరెడ్డి తన హవా సాగించారని, జే బ్రాండ్లు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారన్న అభియోగాలు కూడా వాసుపై ఉన్నాయి. మద్యం పేరుతో వైసీపీ చేసిన దోపిడీకి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వాసుదేవరెడ్డి పనిచేశారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రెండు నెలలుగా వాసుదేవరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని టీడీపీ విమర్శించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు డిస్టిలరీలపై తనిఖీలు చేపట్టారు. అయితే గతంలో వాసుదేవరెడ్డి విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు… గత ప్రభుత్వ హయంలో డిజిటల్ పెమెంట్స్ కన్నా రెగ్యులర్ పేమెంట్స్‌కే ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తించారు. ఎక్కువ మద్యం తయారు చేసి.. బిల్ లేకుండా వైన్స్‌లో అమ్మినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి ఎలా పడింది అనే విషయాలపై డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పదే పదే ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కంపెనీలు అందించిన మద్యం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. సీఐడీ సోదాల్లో లిక్కర్‌ లీలలు బయటకు వస్తే వాసుదేవరెడ్డి ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments