అణుశక్తితో సుదీర్ఘ కాలం పాటు నడిచే జలాంతర్గాముల (న్యూక్లియర్ సబ్ మెరైన్స్) తయారీ దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే భారత సైన్యం అమ్ములపొదిలో మూడు న్యూక్లియర్ మిస్సైల్ సబ్ మెరైన్లు ఉన్నాయి. సముద్రంలో చడీ చప్పుడు లేకుండా సీక్రెట్ గా ప్రయాణించే ఈ న్యూక్లియర్ జలాంతర్గాముల నుంచి బాలిస్టిక్ మిస్సైళ్లను కూడా ప్రయోగించవచ్చు. ఈ తరహాకు చెందిన నాలుగో న్యూక్లియర్ మిస్సైల్ సబ్ మెరైన్ కూడా భారత్కు అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న షిప్ బిల్డింగ్ సెంటర్లో భారత నౌకాదళం ఆవిష్కరించింది. ‘ఎస్4’ అనే కోడ్ నేమ్ కలిగిన ఈ సబ్ మెరైన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులను కూడా శత్రువుల లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు. టెక్నికల్గా ఈ తరహా సబ్ మెరైన్లను ‘ఎస్ఎస్బీఎన్’ అని పిలుస్తుంటారు.
- Advertisment -