ప్రజా సమస్యల పరిష్కార వేదిక దృష్టికి తెచ్చే ఫిర్యాదులకు పరిష్కారం దొరుకుతుందనే భరోసా ప్రజలకు కల్పించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. దీన్ని ఒక మొక్కుబడి తంతుగా భావిస్తే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లి ఎవరూ ముందుకు రారని పేర్కొన్నారు. భీమిలి ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ఆయనే స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతి వారం రెండు, మూడు ఫిర్యాదులకు మించి రాకపోవడాన్ని ఏరకంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ప్రజల్లో నెలకొన్న నిస్తేజాన్ని తొలగించి, అధికారులకు దిశా నిర్దేశం చేయడానికే ప్రతి సోమవారం ఏదో ఒక మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వయంగా పాల్గొంటున్నానని వివరించారు. కేవలం అధికారుల జోక్యంతో, శాఖల మధ్య సమన్వయంతో అనేక ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అలాంటి సమస్యల విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, తొందర్లోనే 3 ఉచిత సిలిండర్లు, ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఉచిత ఇసుక అమలు చేయడానికి రూ. 300 కోట్ల సీనరేజిని ప్రభుత్వం వదులుకుందన్నారు. భీమిలి జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కూటమి నాయకులు కోరాడ రాజబాబు, కె.రామానాయుడు, డి.ఎ.ఎన్. రాజు, గాడు అప్పలనాయుడు, ఆర్డీఓ కె.సంగీత్ మాధుర్, భీమిలి జెడ్.సి. పి.ప్రేమ ప్రసన్నవాణి, ఎమ్మార్వో రామారావు, ఎంపీడీఓ హనుమంతరావు, ఈఓ ఆర్డీ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ లో నేనూ పాల్గొంటున్నా
0
36
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -