Tuesday, June 17, 2025
HomeBlogసీఎం చంద్ర బాబు కొత్త నినాదం....

సీఎం చంద్ర బాబు కొత్త నినాదం….

ఒకప్పుడు జనాభా నియంత్రణ ముద్దు. ఇప్పుడు జనాభా నియంత్రణ వద్దు అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలను కనాలంటూ ఆయన పిలుపునిచ్చారు. లేకుంటే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదంటున్నారు.

అమరావతి రాజధాని నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమంలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధ జనాభా పెరిగి, యువత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ హితం, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదలకు ఆడపడుచులు కృషి చేయాలని సీఎం కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అర్హతల పైనా సీఎం సరదా వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు అయ్యే విధంగా కొత్త చట్టం తీసుకువస్తున్నామంటూ కార్యక్రమంలో నవ్వులు పూయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments