Tuesday, June 17, 2025
HomeBlogరాష్ట్రంలో మళ్లీ వర్షాలు

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ సంస్థ (ఆర్ఎంసీ) వెల్లడించింది. ఈ తుపానుకు ‘దానా’ అని నామకరణం చేసినట్టు తెలిపింది.
రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఆర్ఎంసీ వివరించింది. ఇది వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని పేర్కొంది.
కాగా, ఈ అల్పపీడనం అక్టోబరు 22 నాటికి వాయుగుండంగా, అక్టోబరు 23 నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
ఈ నెల 25న కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు… ఈ నెల 20, 24 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు… ఈ నెల 20న రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగొచ్చేయాలని సూచించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments