తిరుమల పవిత్రతపై ముఖ్యమంత్రి స్పందించరా అంటూ భారత చైతన్య యువజన పార్టీ ప్రశ్నిస్తోంది. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తమ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అక్టోబరు 5వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ ద్వారా కొన్ని కీలక సూచనలు,సలహాలు చేసినా వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయమని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు ఆకుల జయ కల్యాణి అన్నారు.నరసాపురం లో ఆమె మాట్లాడుతూ..సత్వరమే బోడే రామచంద్ర యాదవ్ ప్రతిపాదించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని టీటీడీ బోర్డు, కూటమి ప్రభుత్వం వాటిపైన చర్చించి పారదర్శకతతో వ్యవహరించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. లేని పక్షంలో మా పార్టీ అధినేత నిర్ణయం ప్రకారం పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.
తిరుమల పవిత్రత పై స్పందించరా?
0
46
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -