వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడిన పిఠాపురం పీఠాధిపతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనబడటం లేదని విమర్శించారు. శ్రీ సత్యసాయిలో ఈరోజు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘డిప్యూటీ సీఎం’ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపించారా? అంటూ శ్యామల ప్లకార్డ్ ప్రదర్శించారు. పవన్ గురించి శ్యామల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ సహా నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై కూడా యాంకర్ శ్యామల హాట్ కామెంట్స్ చేశారు. ‘రాష్ట్రంలో కూటమి నాయకుల గెలుపు కానే కాదు.. అంతా మాయ. హిందూపూర్లో ఓ పోలింగ్లో వైసీపీకి ఒక్క ఓటు వచ్చిందంటే.. నందమూరి బాలకృష్ణ గెలుపు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. బాలకృష్ణది అసలు గెలుపు కానే కాదు. మూడుసార్లు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచినా.. హిందూపూర్లో అభివృద్ధి శూన్యం. హిందూపూర్లో డిగ్రీ కళాశాల లేని పరిస్థితి ఉంది,