మాడుగుల: జయజయహే : ఏప్రిల్ 30వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాలీసెట్ పరీక్ష ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదల అయ్యాయి. ఆ ఫలితాల్లో మాడుగుల వీనస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుండి 25 మంది విద్యార్దులు ప్రతిభ కనుబరిచారని ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ తాళ్ళపురెడ్డి నాగ చంద్ర గురువారం తెలిపారు. పరీక్షను 120 మార్కులకు కాగా కిలపర్తి కేశవ 114/120 మార్కులు సంపాదించి మాడుగుల నియోజకవర్గంలో మొదటి స్థానం సంపాదించాడు. అలాగే సాలది తులసి 111/120 మార్కులు సాధించి ద్వితీయ స్థానం సంపాదించింది. పొలమరిశెట్టి జయశ్రీ 109/120 మార్కులు సాధించి తృతీయ స్థానం,ఆడారి ఉషశ్రీ 108 , బర్ల యశ్వంత్ 107 , పట్నాల హాసిని 106, తూరుబిల్లి ధనుంజయ్ 104, పెన బోయిన ప్రదీప్ చంద్ర 103, జల్ది గుణ శ్రీ 100, గౌరీ పట్టపు సిరివర్షిణి 96, భూశాల నాగ వెంకట ఈశ్వరరావు 93, గొర్లి సందేశ్ 92, దూడల హేమంత్ 92, గొర్లి హేమ శృతి 89, కొలిపిల్లి వైష్ణవి 88, మల్ల వంశీకృష్ణ 87, ఆడారి లక్ష్మి సంపత్ కార్తీక్ 86, సకల పూర్ణిమ 85, కర్రీ భరత్ వినయ్ 84, కర్రీ లావణ్య 81, మురళి రంజిత్ కుమార్ 79, కోట్ని బద్రీనాథ్ 78, పప్పల త్రివేణి 75, సాడి గౌతమ్ కుమార స్వామి 75, శిర జయవర్ధన్ 74 మార్కులు పొందారున్నారు. ఈ 25 మందికి తాళ్ళపురెడ్డి నాగచంద్ర శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గంలో మొదటి ఐదు స్థానాలు వీనస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. మంచి మార్కులు సంపాదించినందుకుగాను పిల్లలు, తల్లిదండ్రులు గ్రామ పెద్దలు ఇన్స్టిట్యూట్ కి, యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.