Tuesday, June 17, 2025
HomeBusinessబంగారం చుక్కలు – సామాన్యులకు చిక్కులు

బంగారం చుక్కలు – సామాన్యులకు చిక్కులు

జయజయహే : బంగారం ధరలు రికార్డు స్థాయిలో వున్నాయి . తత్ఫలితంగా కొనుగోలుదారులకు మళ్లీ ఊపిరాడడం లేదు. పండగలు, పెళ్లిళ్లు అనగానే గుర్తొచ్చే బంగారం ధరలు ఇటీవల నిబంధనల కతీతంగా ఎగబాకుతున్నాయి. తులం పుత్తడి ధర రూ.92,000 దాటడం రికార్డు సృష్టించగా, త్వరలోనే లక్ష మార్క్ చేరతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులపై ఆధారపడతాయి. కానీ ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, దేశీయంగా మాత్రం తగ్గుదల కనిపించటం లేదు. దీనికి ముఖ్య కారణం రూపాయి బలహీనత, పెరిగిన దిగుమతులపై విదేశీ మారకద్రవ్య ఒత్తిడి. ఇటీవల బంగారం దిగుమతులపై సుంకాలను తగ్గించడంతో దిగుమతులు పెరిగాయి. ఫలితంగా రూపాయి మరింతగా పతనమవుతోంది. మరోవైపు, జ్యువెల్లరీ పరిశ్రమ సుంకాలను మరింతగా తగ్గించాలని కోరుతుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు కొంత మేర తగ్గుతున్నా, డిమాండ్ తగ్గడం, ట్రంప్ విధించిన సుంకాల తడవ తగ్గడం, వాణిజ్య ఒప్పందాలు మెరుగవుతుండటంతో బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇదే ధోరణి కొనసాగితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత స్థిరపడే అవకాశముంది, అయితే రూపాయి విలువ మరింత తగ్గితే ధరలు మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉంది.

బంగారం ధరల పెరుగుదల ప్రభావాలు పలు విధాలుగా వుంటాయి. పండగలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో బంగారం కొనుగోలు చేయడం సామాన్యులకు కష్టంగా మారుతుంది. పెళ్లిళ్లలో బంగారం ప్రధానమైన భాగం కాబట్టి ధరల పెరుగుదల వల్ల మొత్తం ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలు తగ్గిపోతుంది, దీంతో జువెల్లరీ వ్యాపారాలు మందగతిని ఎదుర్కొంటాయి. బంగారం విలువ పెరగడంతో దోపిడీలు, అక్రమ రవాణా, పన్ను ఎగ్గొట్టే ప్రయత్నాలు పెరిగే అవకాశం ఉంటుంది. బంగారం ధరల పెరుగుదలతో మదుపుదారులు ఇతర రంగాల నుంచి బంగారంలో పెట్టుబడులు మళ్లించటం వల్ల, దేశీయ పెట్టుబడి ప్రవాహం దెబ్బతింటుంది. బంగారం దిగుమతులు పెరగడం వల్ల విదేశీ మారకద్రవ్య వినియోగం పెరుగుతుంది, ఇది రూపాయి పతనానికి దారితీస్తుంది. దిగుమతులపై నియంత్రణ విధించడం: బంగారం దిగుమతులపై అధిక దిగుమతి సుంకాలు విధించడం ద్వారా అవసరానికి మించిన దిగుమతులను తగ్గించవచ్చు. సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతున్న బంగారం యొక్క ధరలను పరిమితం చేసేందుకు ప్రభుత్వం కొన్ని నియంత్రణా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ బాండ్లు (జరిగి ఉన్న సవరన్ గోల్డ్ బాండ్లు) వంటి ప్రత్యామ్నాయాలలో ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలి. సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అవసరం లేని బంగారం వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలను ప్రోత్సహించాలి. బంగారం లో జరుగుతున్న అక్రమ లావాదేవీలు, బినామీ కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. బంగారం నిల్వలపై ప్రభుత్వం క్లియర్ గైడ్‌లైన్స్ ఇవ్వడం ద్వారా మార్కెట్‌లో ఉన్న అస్థిరతను తగ్గించవచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడకుండా చర్యలు తీసుకోవడం ద్వారా బంగారం దిగుమతుల ఖర్చు తగ్గుతుంది, తద్వారా ధరలు క్రమంగా స్థిరపడతాయి. గోల్డ్ లోన్స్‌ పై నియంత్రణ విధించడం ద్వారా బంగారాన్ని డబ్బుగా మార్చే దారిని పరిమితం చేయవచ్చు.

సి.హెచ్.ప్రతాప్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments