Monday, June 16, 2025
HomeLifestyleTravelకొత్తగా 3 విమాన సర్వీసులు

కొత్తగా 3 విమాన సర్వీసులు

విశాఖ నుంచి అబుదాబి, భువనేశ్వర్ కు

విజయవాడ నుంచి బెంగళూరుకు మరో సర్వీసు

జయజయహే : రాష్ట్రం నుంచి మూడు ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర, విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. వీటిలో ఓ అంతర్జాతీయ సర్వీస్ కూడా ఉంది. విశాఖపట్నం – అబుదాబి మధ్య ఈ సర్వీస్ ప్రారంభమవుతుంది. జూన్ 13 నుంచి ఈ సర్వీస్ ప్రారంభం అవుతుంది. విశాఖపట్నం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి ఎయిర్ పోర్టుకు ఈ సర్వీస్ ఉంటుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ నడిపే అంతర్జాతీయ సర్వీసు ఇది. ఈ విమానం వారంలో నాలుగు రోజులు నడుస్తుంది. ఈ సర్వీసు విశాఖపట్నాన్ని అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంతో అనుసంధానిస్తుంది, వ్యాపారం పర్యాటకాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. విశాఖపట్నం – భువనేశ్వర్ మధ్య మరో ఇండిగో సర్వీస్ ప్రారంభం కానుంది. జూన్ పన్నెండు నుంచి ఈ సర్వీస్ ప్రారంభిస్తారు. విశాఖపట్నం నుండి ఒడిశాలోని భువనేశ్వర్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ కొత్త సర్వీసు రెండు తూర్పు భారత నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది, విద్య, వ్యాపారం,పర్యాటకానికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ ఎయిర్ పోర్టు నుండి ఓ కొత్త సర్వీస్ ప్రారంభం కానుంది. జూన్ 2 విజయవాడ నుండి బెంగళూరుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడిపే కొత్త సర్వీసు ప్రారంభమవుతుంది. ఈ సర్వీసు ఏపీ రాజధాని ప్రాంతాన్ని భారతదేశ ఐటీ హబ్‌తో అనుసంధానిస్తుంది, వ్యాపార ప్రయాణికులకు , విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విశాఖ- విజయవాడ మధ్య సర్వీసులు పెద్దగా లేవని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణమంగా విజయవాడ – విశాఖపట్నం మధ్య జూన్ 1 నుంచి ఓ సర్వీస్ ను ప్రారంభిస్తున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ నడిపే ఉదయం విమాన సర్వీసు, విజయవాడ నుండి 7:15 AMకి బయలుదేరి 8:25 AMకి విశాఖపట్నంలో ల్యాండ్ అవుతుంది. తిరిగి విశాఖపట్నం నుండి 8:45 AMకి బయలుదేరి 9:50 AMకి విజయవాడ చేరుకుంటుంది. ఈ సర్వీసు రాష్ట్రంలోని రెండు కీలక నగరాల మధ్య వేగవంతమైన రవాణాను సులభతరం చేస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments