జయజయహే : జీవీఎంసీ 85 వార్డు లో అగనంపూడి శ్రీ శిరిడి సాయి మందిరములో తెలుగు వెలుగు వేదిక ఆధ్వర్యంలో 2025 సంవత్సరమునకు ఉగాది నంది అవార్డు స్వీకరించిన కొయ్య వెంకటరమణారెడ్డి అరుణ దంపతులను ఘన సన్మానం జరిగింది . అనంతరం వక్తలు గాజువాక నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కణంరెడ్డి నర్సింగరావు ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ వైఎస్ఆర్సిపి నాయకులు పి పూర్ణానంద శర్మ టిడిపి నాయకులు గొల్లవిల్లి వెంకట్రావు జనసేన పార్టీ నాయకులు వెంకటరమణ మాటాడుతూ 25 సంవత్సరాలు పైగా ప్రజాసేవలో ఉండి, అగనంపూడి మరియు పునరావాస కాలనీలలో, ప్రతి ప్రజా సమస్యలపై పాల్గొంటూ, అనేక సంవత్సరాల నుండి, అగనంపూడి పాత రామాలయం, నిర్వహిస్తూ, 25 సంవత్సరాలనుండి శ్రీ షిరిడి సాయి మందిరం, సేవా సమితి ద్వారా అనేక మెడికల్ క్యాంపులు, నిర్వహించి ప్రజలందరికీ అందుబాటులో ఉండే రమణారెడ్డి,జాతీయ పురస్కారం, అందుకోవడం, తండ్రుల నుంచి, చేసిన ప్రజాసేవకు, నిదర్శనమని, వారి తండ్రి పేరు న కె ఎస్ ఎన్ రెడ్డి నగర్ లో అనేకమందికి, శాశ్వతంగా ఉండేటటువంటి, నిర్మాణాలను, నిర్మించుకున్న వారు,, ఎంతో అదృష్టవంతులని, ఇటువంటి కార్యక్రమం చేపట్టడం, కొయ్య రమణారెడ్డి కుటుంబమునకు, అవకాశం రావడం, అదేవిధంగా పాత అగనంపూడిలో రామాలయ నిర్మాణం చేపట్టి, నేటికీ ధర్మకర్తలుగా ఉండడం, ఇప్పుడు, షిరిడి సాయి మందిరం నిర్వహించడం, గొప్ప విషయమని, రమణారెడ్డి, అరుణ పూర్తి సహకారం ఉందని, ఉన్న అనేక ఆలయ కమిటీ నిర్వాహకులు, ధర్మాల సుబ్బారావు ఎం నర్సింగరావు, మోటూరి వెంకటరమణ, జి.గజేంద్రరావు, నక్క రమణబాబు,గెద్దాడ అప్పలరాజు, మజ్జి శ్రీను, మంత్రి మురళి,సత్య సాయి కమిటీ సభ్యులు, సుబ్బారావు, వి. పైడి నాయుడు, ఏ శ్రీనివాస్, ఉక్కు మాజీ అధికారి ఎల్వి రమణ, టిడిపి నాయకులు, గంత కోరు అప్పారావు, భవాని, వెంకట్రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త, మాదాసు శ్రీనివాసరావు, లైన్మెన్ పైడిరాజు, లంకెలపాలెం వాస్తవ్యులు ఉపాధ్యాయురాలు, జానకి చెప్పారు.షిరిడి సాయి సేవా సమితి కార్యదర్శి, సన్మాన నిర్వాహకుడు, ధర్మాల వ్యాస శర్మ, ఉప కార్యదర్శి, జి శంభుడు, పి రామారావు, పి సత్యనారాయణ, డాక్టర్ రామకృష్ణ,టోపీ రాజు, మహిళా కమిటీ సభ్యులు, డి. సత్యలక్ష్మి, జి లీలావతి, సూరీడమ్మ, మాట్లాడుతూ, అనేక, కష్ట పరిస్థితులను ఎదుర్కొని, 25 సంవత్సరాల క్రితం, పాక కట్టుకొని, మందిర పనులు ప్రారంభించి నేటికీ, షిరిడి సాయి మందిరం నిర్మించడానికి, కొయ్య వెంకటరమణారెడ్డి చేసిన సేవ మరువలేనిది. ఇంతమంది ప్రముఖులు, ఈ కార్యక్రమానికి రావడం, ఎంతో ఆనందంగా ఉందని, అగనంపూడిలో ఉన్న, ప్రముఖ దేవాలయాల్లో ఒక దేవాలయం గా, నిర్మించడం పూర్తిగా, రమణారెడ్డి, కృషి, ఈ విధమైన స్థితికి రమణారెడ్డి రావడానికి, వారి,శ్రీమతి కొయ్య అరుణ, తోడ్పాటు ఎంతో ఉందని, ఆయనతోపాటు మేము , ఎల్లప్పుడు ఈ విధంగానే, ప్రోత్సాహకరంగా ఉంటామని, భవిష్యత్తులో రమణారెడ్డి, మరెన్నో జాతీయ పురస్కారాలు, అందుకోవాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పారు. జాతీయ పురస్కార్ అవార్డు గ్రహీత, బ్రహ్మశ్రీ భాస్కర బట్ల, సత్యప్రసాద్ శర్మ మాట్లాడుతూ, నంది పురస్కార అవార్డు రావడానికి , పరిపూర్ణ అర్హుడు రమణారెడ్డి అని, కోరుకుంటే వచ్చే అవార్డు కాదని అర్హత ఉంటేనే అన్ని వస్తాయని, తెలుగు భాషను కూడా, మనం ప్రోత్సహించాలని, భవిష్యత్తులో కూడా రమణారెడ్డి జాతీయ పురస్కారాలు అందుకోవాలని అప్పుడు కూడా తన వంతు సహాయం చేస్తానని, చెప్పారు. అవార్డు గ్రహీత కొయ్య వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఇంతటి ఘన సన్మానం నిర్వహించిన, కమిటీ సభ్యులకు, ముఖ్యంగా మా తాత తండ్రులు దగ్గర నుంచి ఆదరిస్తున్న, అగనంపూడి, మరియు పునరావాస, గ్రామ ప్రజలకు, ఎంతో రుణపడి ఉంటామని, ఈ మందిర నిర్మాణంలో అనేకమైన, కష్ట పరిస్థితులను, దాటుకొని ఈరోజు ఈ విధంగా నిర్మించడం, నాకు నంది అవార్డు, రావడానికి ప్రోత్సహించిన బ్రహ్మశ్రీ, భాస్కర పట్ల సత్య ప్రసాద్ శర్మ కి, ఎంతో బిజీగా ఉన్నా, ఈ కార్యక్రమానికి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, రుణపడి ఉంటానని, నా అభ్యున్నతికి, ఈరోజు, ఈ స్థితిలో ఉండటానికి, నా అరుణ అండ దండలు ప్రోత్సాహం, మరువ లేనిది అని, భవిష్యత్తులో కూడా ప్రజాసేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటానని,చెప్పారు. ఈ కార్యక్రమంలో, కొయ్య భాస్కర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రామచంద్రరావు రెడ్డి, కిషోర్ రాజు, తరుణ్, నవీన్, ఆలయ అర్చకులు, సునీల్ శర్మ, పి పవన్ కుమార్ పాల్గొన్నారు.
జాతీయ పురస్కారం స్వీకరించిన షిరిడి సాయి సేవా సమితి అధ్యక్షుడుకి ఘన సన్మానం.
0
13
RELATED ARTICLES
- Advertisment -