పెందుర్తి జయ జయహే: పరవాడ మండలం బరిణకం గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు సీసీ కాలువల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో పాల్గొని పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది పదో తరగతి పరీక్షల్లో గ్రామం నుండి మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందిన విద్యార్థిని విద్యార్థులకు సాలువల తో సత్కరించి మెమొంటోల ను అందించారు గ్రామంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై గ్రామస్తులందరి తో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గ్రామస్తులకు తెలిపారు ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు