Tuesday, June 17, 2025
HomeBlogబృహత్ ప్రణాళిక రహదారులను పరిశీలించిన గంటా , వి ఎం ఆర్ డి ఎ చైర్మన్

బృహత్ ప్రణాళిక రహదారులను పరిశీలించిన గంటా , వి ఎం ఆర్ డి ఎ చైర్మన్

జయజయహే : వి ఎం ఆర్ డి ఏ ప్రతిపాదించిన బృహత్ ప్రణాళిక రహదారులను క్షేత్ర స్థాయిలో భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు తో కలిసి వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ పరిశీలించారు. బుధవారం ఉదయం భీమిలి శాసనసభ నియోజకవర్గం పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఏ రోడ్లు విస్తరించాలి, ఎక్కడెక్కడ ఎలైన్మెంట్లను మార్చాలి తదితర అంశాలను చర్చించారు అనంతరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు , వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ఆర్ డి పి ఆమోదం పొందిన రహదారులను సాద్యమైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అడవివరం , భీమిలి బీచ్ రోడ్డు, పాత అడవివరం జంక్షన్, సత్తరువు జంక్షన్, ఆనందపురం జంక్షన్, పెద్దిపాలెం జంక్షన్, దొరతోట జంక్షన్, నేరళ్లవలస జంక్షన్ ల మీదుగా క్షేత్ర స్థాయిలో పర్యటన జరిగింది. జాయింట్ కమిషనర్ కె రమేశ్, ఎస్టేట్ అధికారి దయానిధి, ముఖ్య ప్రణాళిక అధికారిణి శిల్ప అధికారులు సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

                           

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments