జయజయహే : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతావని భావిస్తున్న తరుణంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.’ కొంచెం ఓపిక పట్టండి..భారత్ లోని ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది. దేశంపై కన్నెత్తి చూసిన వాళ్లకు గట్టి గుణపాఠం చెబుతాం. అసలైన దాడులు జరిగేందుకు కొంచెం ఓపికతో ప్రజలు ఉండాలి’ అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దిల్లీలో నిర్వహించిన సంస్కృతి జాగరన్ మహోత్సవ్ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంకోసం సైనికులు ప్రాణాలు అర్పించారు. మన దేశాన్ని రక్షించుకుంటూ వచ్చారు. పెద్దలు, మత పెద్దలు, గురువులు మన ఆధ్యాత్మికతను కాపాడారు. సైనికులు రణభూమిపై పోరాడారు. ఆధ్యాత్మిక గురువులు జీవనభూమిపై పోరాడారు. రక్షణమంత్రిగా అటు సైనికులను, ఇటు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. నా దేశంపై దాడికి పాల్పడిన వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా నాదే.
కొంచెం ఓపిక పట్టండి.. మారణహోమం ముందుంది.. రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
0
18
Previous article
RELATED ARTICLES
- Advertisment -