విశాఖపట్నం : జయజయహే : సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ప్రారంభమైనది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన అర్జీదారులతో పిజిఆర్ఎస్ కోలాహలంగా మారింది . ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ తో పాటు…. జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జి.వి..ఎం.సి అడిషనల్ కమిషనర్ వర్మ వినతుల పత్రాలు స్వీకరించారు . వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.