సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదు: మంత్రి నారా లోకేశ్.
జయజయహే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని డీఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికెట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతుండటంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అయితే వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ సమర్పించాలని పేర్కొన్నారు. మొత్తం 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజవ్వగా మే 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనున్నాయి.