సింధు నది టిబెట్లో ఉద్భవించి, భారతదేశం, పాకిస్తాన్ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రధాన ఆధారం. సింధునదిపై అనేక ఆనకట్టలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. సింధు నది సముద్ర మట్టానికి దాదాపు 5,182 మీటర్ల ఎత్తులో టిబెట్లోని మానసరోవర్ సరస్సు సమీపంలోని సిన్-కా-బాబ్ ప్రవాహంలో ఉద్భవించి, ఇండియా గుండా ప్రవహించి, పాకిస్తాన్లోని కరాచీ నది సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆసియాలో అతి పొడవైన నదులలో ఒకటైన సింధు నదీ పరీవాహక ప్రాంతాన్ని చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటాయి. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో 60 శాతం పాకిస్తాన్లో ఉంది. సింధు నది ఇక్కడి అనేక ప్రావిన్సులలో వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలకు మూలం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే ఏకైక నది ఇదే కాబట్టి దీనిని పాకిస్తాన్ జీవనాధారంగా పిలుస్తారు. సింధు నది పొడవును పరిశీలిస్తే, ఈ నది వైశాల్యం దాదాపు 11,65,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ నది మొత్తం పొడవు 3,180 కి.మీ. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే ఐదు నదులు సింధు నదికి ప్రధాన ఉపనదులు. పాకిస్తాన్ భూమిలో 92 శాతం శాశ్వత నీటిపారుదల వ్యవస్థ లేనందున సింధు నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఏకైక ఆధారం.దాదాపు 3,200 కిలోమీటర్ల పొడవున్న సింధు నది భారతదేశంలో దాదాపు 800 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. ఈ నది జమ్మూ కశ్మీర్, లడఖ్ గుండా ప్రవహిస్తుంది. అయితే, వాస్తవానికి, ఈ నదిలో ఒక చిన్న భాగం మాత్రమే భారత నియంత్రణలో ఉంది. సింధు నది దాని ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు. ఇందులో విద్యుత్తును ఉత్పత్తి చేసే అనేక పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. భారతదేశంలో సట్లెజ్ నదిపై భాక్రా ఆనకట్ట, బియాస్ నదిపై పండో ఆనకట్ట, చీనాబ్ నదిపై బాగ్లిహార్, దుల్హస్తి ఆనకట్టలు, జీలం నదిపై ఉరి, కిషన్గంగా ప్రాజెక్టులు నిర్మించారు. పాకిస్తాన్లో సింధు నదిపై తుర్బెలా ఆనకట్ట, జీలం నదిపై మంగళ ఆనకట్ట, నీలం-జీలం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ఆనకట్టలన్నీ ఇండియా, పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తికి, నీటిపారుదల వ్యవస్థకు ఉపయోగపడుతున్నాయి.
సింధు నది ఎక్కడ పుట్టింది? ఎన్ని దేశాల గుండా ఈ నది ప్రవహిస్తుంది? పూర్తి చరిత్ర
0
16
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -