అనంతగిరి: జయ జయహే: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. సోమవారం అనంతగిరి మండల కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా మండల ప్రజా ప్రతినిధులతో మరియు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ప్రజా ప్రతినిధులు మండలంలో జరుగుతున్న భూమూల ఆక్రమణలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా బీంపోలు పంచాయితీలో పరిధిలో అక్రమానికి గురైన ప్రభుత్వ స్థలాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పరిశీలించారు . ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను స్థానిక ప్రజలకు అడిగి తెలుసుకోని ప్రభుత్వ భూములు ఆక్రమణ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం, పెసా చట్టాలను పూర్తిస్థాయిలో అమలు జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు వలస పెరిగిపోతుందని ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని భూ ఆక్రమణలను ఆపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి , వైసిపి మండల పార్టీ అధ్యక్షులు కొర్ర సూర్యనారాయణ మరియు మండల అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.