జయజయహే : రాష్ట్రంలో కూటమి సర్కార్ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో నిమగ్నమై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మత్స్యకారుల నాయకుడు గంటా నూకరాజు అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. సముద్రంపై వేటచేసే గంగపుత్రులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకారుల బృతిని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీని సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా అమలు చేయడం చాలా గర్వంగా ఉందని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పుటకు ఇంతకంటే రుజువు ఏముందని అన్నారు. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా తీరంలో ఉండే 12 జిల్లాల్లో 1,29,178 మంది మత్స్యకారులకు 20,000 రూపాయలు చొప్పున శనివారం ముఖ్యమంత్రి విడుదల చేస్తున్నారని అన్నారు. ఈ పధకం కోసం 258 కోట్లు వెంటనే విడుదల చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. మా మత్స్యకారులపై ఇంతటి శ్రద్దపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి మా అందరి తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని అన్నారు. 2014-19 సంవత్సరంలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పధకాలు పెట్టిందని అన్నారు. 50 శాతం సబ్సిడీతో వలలు, బోట్లు, ఇంజన్లు ఇచ్చి ఆదుకుందని అన్నారు, ఐస్ బాక్షులు. 50 ఏళ్లకే ఎన్టీఆర్ భరోసా ద్వారా మత్స్యకారులకు ఫించన్ ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని గంటా నూకరాజు అన్నారు. మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేకంగా 6 జిల్లాల్లో రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారని అన్నారు. కూటమి సర్కారు ఆక్వారంగం అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తుందని అన్నారు. స్వర్ణాoద్ర-2047 విజన్ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఆక్వారంగాన్ని గ్రోత్ ఇంజన్ గా ఎంచుకుందని అన్నారు. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలకు 4,000 రూపాయలు చొప్పున ఫించన్ ఇస్తుందని అన్నారు. 28-60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మత్స్యకారులు సముద్రంలో వేట చేస్తూ మరణిస్తే 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తుందని అన్నారు. వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్ పై 9 రూపాయలు సబ్సిడీ ఇస్తుందని అన్నారు. మరబోట్లకు నెలకు 3000 లీటర్లు, ఔట్ బోట్ మోటార్ బోట్లకు నెలకు 300 లీటర్లు సబ్సిడీ ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 9 ఫిషింగ్ హార్భర్లు, 7 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం 2,200 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని అన్నారు. ఆక్వా రంగానికి విద్యుత్ వినియోగదారులకు యూనిట్ కు 1-50 పైసలకు మాత్రమే అందిస్తుందని అన్నారు. కూటమి సర్కార్ మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎంతలా పనిచేస్తుందో మత్స్యకారులు గుర్తించాలని గంటా నూకరాజు అన్నారు.
మత్స్యకారుల సేవలో కూటమి సర్కార్…! టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు హర్షం
0
12
RELATED ARTICLES
- Advertisment -