Wednesday, June 18, 2025
HomeBlogగంజాయి వినియోగంతో సమాజానికి చేటు - జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్

గంజాయి వినియోగంతో సమాజానికి చేటు – జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్

పాడేరు: జయజయహే : గంజాయి వినియోగంతో సమాజానికి చేటని గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేసారు. జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో గంజాయి సాగు నిర్మూలన పై ఈగల్, పోలీస్, వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, ఉద్యానవన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఐసిడిఎస్, డ్వమా, డి. ఆర్. డి. ఏ అధికారులతో గంజూయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై గురువారం సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలలో గంజాయి వినియోగంపై కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. కళాశాలల్లో అవగాహనా సదస్సులు, డి ఎడిక్షన్ సెంటరుకు ఎంత మంది వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంజాయి సాగు చేసే రైతులు, సరఫరాదారులు పై ప్రత్యేక దృష్టి పెట్టి అటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. గంజాయి విడిచి పెట్టిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, స్వయం ఉపాధి పథకాలు, బ్యాంకు రుణాలు, పశువులు, మేకలను మంజూరు చేయాలని స్పష్టం చేసారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని ఆరా తీసారు. గంజాయి నిర్మాలనపై గ్రామ స్థాయిలో బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. 15 వేల ఎకరాలల్లో నీడ తోటలు, పండ్ల తోటలు పెంపకానికి ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. పది ఫెయిలైన విద్యార్ధులతో సప్లమెంటరీ పరీక్షలకు ఫీజులు కట్టించాలని సూచించారు. వారపు సంతల్లో గంజాయిపై అవగాహనా శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లా ఎస్సీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా వారి స్థిర, చరాస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గంజాయి స్మగ్లర్లకు గిరిజన గ్రామాల్లో ఆశ్రయం కల్పించడం నేరమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 221 గ్రామాల్లో గంజాయి సాగు నిర్మూలనపై అవగాహనా సదస్సులు నిర్వహించామన్నారు. పక్క మార్చి నెలలో 9 మందిపై కేసులు నమోదు చేసి 782 కేజీల గంజాయిని పట్టు కున్నామన్నారు. బస్టాండ్లలో పటిష్టమైన నిఘా పెట్టామని చెప్పారు. జాతీయ విద్యా విధానాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. అనంతరం గంజాయి నిర్మూలనపై రూపొందించి గోడ పత్రికలను అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ సౌర్యమన్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ (వర్చువల్) జిల్లా వ్యవసాయాధికారి ఎస్. బి. ఎస్. నంద్, జిల్లా ఉద్యాన వన అధికారి రమేష్ కుమార్ రావు, జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీరావు, గృహ నిర్మాణ శాఖ ఇ ఇ బి. బాబు, డి ఎస్ ఓ, వెంకటరావు, ఈగల్ ఇన్సెపెక్టర్ ఎస్.రమేష్, వివిద శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

                             

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments