విశాఖపట్నం జయ జయహే : నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ ఆర్ సి, జాతీయ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ అధ్యక్షతన *నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ ఆర్ సి* జాతీయ రాష్ట్ర జిల్లాల నాయకులు విశాఖపట్నం జిల్లా పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, హ్యూమన్ రైట్స్ పేరుతో తప్పుడు రిజిస్ట్రేషన్ లతో స్వచ్ఛంద సేవా ముసుగులో కంపెనీ రిజిస్ట్రేషన్లు చేసుకొని వాటి ద్వారా మెంబర్షిప్ లిస్టు ప్రజలకు మోసం చేస్తున్నటువంటి సంస్థలపై ఇటీవల భారత ప్రభుత్వం వారు దృష్టి పెట్టి వాటి యొక్క వివరాలను సేకరించే పనిలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఆదేశాలు అందినట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రతి చోట కూడా ఇటువంటి సంస్థలపై నిఘా పెట్టియున్నారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ ఆర్ సి కేంద్ర పరిపాలనా కార్యాలయం గాజువాక విశాఖపట్నం లో కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇటీవల సందర్శించి అన్ని రకాల రికార్డులను పరిశీలించి ఉన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ ఆర్ సి అన్ని రకాల గుర్తింపు పొందినందున నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ ఆర్ సి కి కాపీరైట్స్ కూడా ఉన్నందున, నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఎన్ సి టి గుర్తింపు పొందిన సంస్థ, అలాగే మూడు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువైన సంస్థ, దీనిలో భాగంగానే ఈరోజు సంస్థ యొక్క సభ్యులతో కలిసి స్థానిక కమిషనరేట్ లో కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం శంఖభ్రత బాగ్చిని కలసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ ఆర్ సి, యొక్క రేకగ్నైజేషన్లు, మరియు అధికారాలకు సంబంధించిన వివరాలు, వాటి యొక్క లీగల్ పత్రాలను సమర్పించినట్లు సంస్థ వ్యవస్థాపక నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ తెలియజేశారు, ఇప్పటికే విశాఖపట్నం సిటీ స్పెషల్ బ్రాంచ్ పోలీసు వారికి వివిధ జిల్లాల స్పెషల్ బ్రాంచ్ పోలీసు వారికి సమస్య యొక్క పూర్తి వివరాలను అందజేసియున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ఆఫీస్ అమరావతి వారికి, ఇటీవల నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ ఆర్ సి ( ఎన్జీవో) పేరుతో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వేదికగా ఒక ఫేక్ ఆర్గనైజేషన్ నెలకొన్న దృశ్య ఆ సంస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి కి, జగిత్యాల సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వారికి, జగిత్యాల టౌన్ పోలీస్ వారికి ట్రేడ్ మార్కింగ్ కాపీ రైట్స్ వ్యతిరేకంగా స్థాపించిన ఆ సంస్థ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా చేసిన సమయంలో తెలంగాణ డిజిపి వారికి మరియు జగిత్యాల ఎస్పీ వారికి ఇటీవల నల్గొండ జిల్లా ఎస్పీ వారికి సమస్య యొక్క పూర్తి చేసిన పత్రాలు కాపీరైట్స్ పత్రాలు సమర్పించడం అయినది. ఈ కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ పబ్లిక్ రైట్స్ శివలంక అప్పారావు, ఉత్తరాంధ్ర చైర్మన్ చిట్టిబాబు, విశాఖపట్నం జిల్లా చైర్మన్ శంకర్రావు, మహిళ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆదిలక్ష్మి, రాష్ట్ర మహిళా వెల్ఫేర్ వెంకటలక్ష్మి, రాష్ట్ర కోఆర్డినేటర్ పబ్లిక్ రిలేషన్స్ దమ్ము లక్ష్మణరావు, మొదలగు సభ్యులు పాల్గొన్నారు
విశాఖపట్నం జిల్లా పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్ హెచ్ ఆర్ సి
0
21
RELATED ARTICLES
- Advertisment -