విశాఖపట్నం : జయ జయహే : సుదూర ప్రాంతాలనుండి సమస్యల పరిస్కారం కోసం వచ్చే అర్జీదారులకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది బృహుత్తర మానవతా సేవ కార్యక్రమాన్ని చేపట్టింది.గ్రామీణ ప్రాంతాలనుండి వ్యయ ప్రయాసలను ఓర్చి సమస్యల పరిష్కరానికి వచ్చే వారికి అదనముగా మంచినీరు తో పాటు తినుబండారాలు ఖర్చు ఎక్కవుతుంది.సమస్యలు పరిస్కారం అయినా కాకపోయినా రోజువారీ ఖర్చుతప్పలేదు. ఖర్చు సమస్య తీవ్రత ను గుర్తించిన కలెక్టర్ యం.ఎన్.హరేంద్రప్రసాదు ఆదేశంతో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు అందించేందుకు ముందుకువచ్చి తాగునీరు. టీ .బిస్కెట్, పాటు బీపీ షుగర్ వ్యాధి గ్రస్తులకు వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అర్జీదారులు కోరుతున్నారు.సౌకర్యవంతముగా కుర్చీలు ఫాన్స్ ,మొదలగు సౌకర్యాలు ఏర్పాటు చేసారు.కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి అర్జీదారులు కృతఙతలు తెలియజేసారు.ప్రజలకు సేవ చేయడమే తమ ప్రధాన ప్రాధాన్యత కలెక్టర్ కార్యాలయ సిబ్బంది చెప్పుకొచ్చారు.
.