గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం టీడీపీ కైవసమైంది.
జీవీఎంసీ మేయర్ వెంకటకుమారిపై ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.
దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది.