విశాఖపట్నం :జయజయహే : మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు దక్షిణ వైసిపి వార్డు అధ్యక్షులందరూ ఐక్యతతో నొల్లు పోతు స్వామి కుటుంబానికి రూ. 40,000 లు ఆర్ధిక సాయం అందించారు. ఈ మేరకు ఆశీలమెట్ట కార్యాలయంలో శుక్రవారం వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా పోతుస్వామి భార్య, కుమారుడు నొల్లు యల్లయమ్మ, నొల్లు చంటి కి నగదును అందజేశారు. ఇటీవల అకాల మృతి చెందిన 37వ వార్డు వైసిపి సీనియర్ నాయకుడు నొల్లు పోతు స్వామి కుటుంబానికి సొంత నిధులతో వాసుపల్లి సాయం అందించారు. అలాగే దక్షిణ వైసీపీ శ్రేణులు కూడా ఐక్యతతో ముందుకు రావాలని ఇచ్చిన పిలుపుమేరకు మరొకసారి ఆర్థిక సాయం చేశారు. ముందుగా వాసుపల్లి కి దక్షిణ వైసిపి వార్డు అధ్యక్షులు శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ కలిసి ఉంటే ఎంత కష్టమైనా ఎదుర్కోవచ్చును అన్నారు. పార్టీ కష్టకాలంలో అంతా కలిసి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. తన మాటను మన్నించి సాయం అందించడానికి ముందుకు వచ్చిన వైసీపీ శ్రేణులు అందరికీ వాసుపల్లి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీకి పూర్వవైభవం తీసుకు రావాలన్నారు. మనతోపాటు పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసిన 37వ వార్డు వైసిపి అధ్యక్షుడు నోళ్లు పోతుస్వామి (పోతురాజు) మృతి ఆ కుటుంబానికే కాదు పార్టీ కి కూడా తీరని లోటు అన్నారు. వైసీపీ బ్లడ్ నర నరాల్లో నింపుకున్న అటువంటి కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండడం మన బాధ్యత అని అన్నారు. అనంతరం వైసిపి వార్డు నాయకులు మాట్లాడుతూ దక్షిణ ప్రజలకు, వైసిపి నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన పిలుపుకు తామంత సహకారం ఇచ్చామన్నారు. భవిష్యత్తులో కూడా వాసుపల్లి గణేష్ కుమార్ ని ఇప్పటికే ఆదరిస్తున్న ప్రజల ఆశీస్సులతో వైసీపీనీ అధికారంలో తీసుకువస్తామని ముక్తకంఠంతో వెల్లడించారు. కార్యక్రమంలో 27వ వార్డ్ అధ్యక్షులు సర్వేశ్వరరెడ్డి,29వ వార్డ్ అధ్యక్షులు పీతల వాసు, 30వ వార్డ్ అధ్యక్షులు దశమంతలు మాణిక్యాలరావు, 31వ వార్డ్ మరియు సౌత్ ఆర్.టి.ఐ అధ్యక్షులు దొడ్డి బాపుఆనంద్, 32వ వార్డ్ అధ్యక్షులు రాజా రెడ్డి,33వ వార్డ్ అధ్యక్షులు ముత్తాబతుల రమేష్,34వ వార్డ్ అధ్యక్షులు తోట పద్మావతి, 35వ అధ్యక్షులు ఆలుపన కనకరెడ్డి,37వ వార్డ్ ఆకుల ఏసు, 38వ వార్డ్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు సనపల భరత్, 39 వ వార్డ్ మరియు సౌత్ బూత్ కమిటి అధ్యక్షులు ముజీబ్ ఖాన్, 41 వ వార్డ్ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ పూర్ణిమ,42 వ వార్డ్ అధ్యక్షులు భీశెట్టి ప్రసాద్, ఎర్రినమ్మ తల్లి గుడి చైర్మన్ లండ రమణ సౌత్ కల్చరల్ వింగ్ అధ్యక్షులు సూర్య నాయుడు, చంద్ర మౌళి, అజయ్, వాసుపల్లి రాజు, రామరాజు, చింతకాయల వాసు, తదితరులు పాల్గొన్నారు.