Wednesday, June 18, 2025
HomeBHAKTI18న కర్నూలు గోదాగోకులం నందు 2వేల మందితో విష్ణు సహస్రనామ పారాయణం - శ్రీమద్రామాయణ మహాయజ్ఞం...

18న కర్నూలు గోదాగోకులం నందు 2వేల మందితో విష్ణు సహస్రనామ పారాయణం – శ్రీమద్రామాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి

-శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ

కర్నూల్ : జయజయహే : మహామహోపాధ్యాయ కవిశాబ్దిక కేసరి, ఉభయ వేదాంత పండితులు శాస్త్ర రత్నాకర, సత్సంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి వేడుకల సందర్భంగా గత నాలుగు రోజులుగా కర్నూలు శివారులోని గోదాగోకులం నందు జరుగుతున్న శ్రీమద్రామాయణ మహా యజ్ఞం అత్యంత వైభవంగా జరుగుతున్నదని త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ అన్నారు. గోదాగోకులం నందు గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ రఘునాథ ఆచార్యుల వారి విద్వత్తు అసామాన్యం. ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో సమస్త వేద ధర్మశాస్త్రాల పాండిత్యాన్ని ఆపోసన పట్టి దేశంలోని పండితులందరికీ బహిరంగచర్చకు రమ్మని సవాలు విసిరిన ధీశాలి. మహా పండితులకు భాష్యాన్ని ముమ్మారు ప్రబోధించిన విద్వత్ శిరోమణి. శ్రీ విష్ణు సహస్రనామావళికి తెలుగులో 1200 పుటలతో విస్తృతమైన వ్యాఖ్యను సామాన్య మానవులకు సైతం అర్థమయ్యేలా రచించిన సాహితీ దిగ్గజం. 95 సంవత్సరాల వయస్సులో కూడా అసాధారణ జ్ఞాపక శక్తిని కలిగి సంస్కృత తెలుగు సాహిత్య ధార్మిక గ్రంథాలలోని అనేకమైన సందేహాలను తీర్చి, సనాతన ధార్మిక సంప్రదాయక జీవన విధానాల గురించి మార్గోపదేశం చేసిన మహానుభావులు. వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా గీత నాలుగు రోజులుగా నిర్వహించబడుతున్న శ్రీ రామాయణ మహా యజ్ఞ పూర్ణాహుతి వారి తిరు నక్షత్ర పవిత్ర తిథి సందర్భంగా శుక్రవారం నిర్వహించబడుతోంది. రామాయణాన్ని విశ్వ శ్రేయః కావ్యంగా అభివర్ణించి అత్యంత ప్రచారం కల్పించిన వారి జయంతి సందర్భంగా శ్రీ మద్రామాయణ మహాయజ్ఞం నిర్వహించటము, అందులో భాగంగా రామాయణాన్ని గురించినటువంటి విభిన్న అంశాల పైన ప్రవచకులచే ప్రసంగాలు ఇప్పించటము జరుగుతున్నది. చివరి రోజున శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా వివిధ పీఠాధిపతులు, స్వామీజీలు, ముప్పది మందికి పైగా ఉభయ వేదాంత పండితులు పాల్గొని రఘునాథాచార్యుల వారి జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవలసిన ఆవశ్యకతను, వారి విశిష్టతను వివరిస్తూ వారికి నివాళులర్పిస్తారు. ఇంతటి పరమ పవిత్రమైన కార్యక్రమంలో 2000 మందికి పైగా భక్తులచే విష్ణు సహస్రనామ పారాయణం కూడా నిర్వహించబడుతోంది. లోకకల్యాణకారకమైన ఈ కార్యక్రమంలో నగర వాసులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని గోదా రంగనాథ స్వామి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. భక్తులందరికీ భోజనాలతో పాటు శ్రీ గోదా రంగనాయికి ప్రసాదాన్ని భక్తులందరికీ అందించనున్నారు.ఈ కార్యక్రమంలో ప్రయాగ్రాజ్ నుండి రాఘవ ప్రపన్న జీయర్ స్వామీజీ, శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శఠగోపముని రామానూజ జీయర్ స్వామీజీ, గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, శ్రీమద్రామాయణ ప్రవచన యజ్ఞ సమన్వయకర్త డాక్టర్ తొగట సురేశ్ బాబు, గోదాపరివారం సభ్యులు పాలాది సుబ్రహ్మణ్యం, పెరుమాళ్ళ బాలసుధాకర్, వేముల జనార్ధన్, ఇటిక్యాల పుల్లయ్య, భీమిశెట్టి ప్రకాశ్, లింగం రవి, సురేష్, తలుపుల శ్రీనాథ్, పాలాది వెంకట సుబ్రహ్మణ్యం, చిత్రాల వీరయ్య, వేముల పవన్ కుమార్, డాక్టర్ నాగనారాయణ రావుపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురువారం జరిగిన శ్రీమద్రామాయణం విశిష్టతపై హిందీ అద్యాపకులు యం. పార్వతి, తెలుగు ఉపాధ్యాయిని పసుపులేటి నీలిమ, అవధాని డాక్టర్ గంగుల నాగరాజు, యం గోపాలా చార్యులు, తదితరులు ప్రవచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments