Friday, June 20, 2025
HomeBlogకెజీహెచ్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటుకు సిఫారసులు:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం

కెజీహెచ్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటుకు సిఫారసులు:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం

విశాఖపట్నం: జయజయహే “కెజిహెచ్ జన్మదిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న కేంద్రం ఆవరణలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసేలా విశాఖ జిల్లా ఉన్నతాధికారులకు వివిధ సిఫారసులు చేయనున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీ ఎస్సీపిసి ఆర్)సభ్యులు గొండు సీతారాం చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ కమిషన్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇటీవల ఆసుపత్రి ఉన్నతాధికారులు ప్రసూతి వార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన జనన ధ్రువీకరణ పత్రాల జారీ కేంద్రాన్ని బుధవారం ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ వి.రవి, ఆంధ్రా మెడికల్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కె.వి.ఎస్.ఎం.సంధ్యా దేవి,ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.వి.రమణ,ఆసుపత్రి సి.ఎస్.ఆర్.ఎం.ఓ.జి.మెహర్ కుమార్,చిన్న పిల్లల వార్డు విభాగాధిపతి డాక్టర్ బి.ఎస్.చక్రవర్తి,ప్రసూతి విభాగం వైద్యులు డాక్టర్ కె.శ్యామల,డాక్టర్ సువిధ తదితరులతో కలసి సందర్శించారు,అనంతరం సూపరింటెండెంట్ ఛాంబర్ ప్రక్కన గల సమావేశ మందిరంలో వీరితో సీతారాం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలతో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో జన్మదిన ధృవీకరణ పత్రాలను స్వీకరించడంలో తల్లిదండ్రులకు,పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దరఖాస్తుల స్వీకరణ,తప్పొప్పులు సరిచేయు కేంద్రం,ధ్రువీకరణ పత్రాలను 24 గంటల్లోగా అందజేయాలన్న లక్ష్యాన్ని చేరువ కావడం ఉత్తరాంధ్ర బాలల విజయమని సీతారాం అన్నారు,అలాగే ఈ కేంద్రం తాత్కాలిక ఊరటగా భావించకుండా,శాశ్వత పరిష్కారంగా నిలవాలని సూచించారు,ఉత్తరాంధ్రతో పాటు ఒడిస్సా,ఛత్తీస్ గడ్ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ వైద్యం,చికిత్సలు పొందుతుండడంతో ఏ కోశానా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికపుడు ప్రణాళికయుత చర్యలు అవసరమని అన్నారు,ప్రధానంగా గతంలో ఆధార్ లో నమోదై ఉన్న పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల పేర్లలో తప్పులు, వివాహం జరిగిన తల్లి ఇంటిపేరు నుండి తండ్రి ఇంటి పేరున త్వరితగతిన మార్పులు,చేర్పులు జరిపి నూటికి నూరు శాతం తప్పులు లేని జన్మదిన ధృవీకరణ పత్రాలను అందించడంలో ఆధార్ కార్డులో సమూల మార్పులు ద్వారానే సాధ్యమన్న శత శాతం వాస్తవాన్ని ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది తన దృష్టికి తెచ్చారని అన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈ కేంద్రంలో ఆధార్ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు జరిగేలా జిల్లా అధికారులను వివిధ సిఫారసులు చేయనున్నట్టు సీతారాం తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో స్టాటిస్టికల్ అధికారి దయానిధి రావు,అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ శంకర్రావు,నోడల్ ఆఫీసర్ శ్రీకళ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రోజెక్ట్ ఆఫీసర్లు ఎం.వి.రమణ కుమారి,శ్రీలత,ప్రొటెక్షన్ ఆఫీసర్ బి.మమత,ఒన్ స్టాప్ సెంటర్ ప్రతినిధులు శరణ్య,మాలతి,శాంత,సుజాత,రామలక్ష్మి,కౌన్సిలర్ శకుంతల,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments