Wednesday, June 18, 2025
HomeDhopidiఅనకాపల్లి జిల్లా లో వరుస చోరీల కేసుల పరిష్కారంలో కీలక విజయాన్ని సాధించిన జిల్లా పోలీసులు

అనకాపల్లి జిల్లా లో వరుస చోరీల కేసుల పరిష్కారంలో కీలక విజయాన్ని సాధించిన జిల్లా పోలీసులు

అనకాపల్లి : జయజయహే : అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకున్న వరుస చోరీల కేసు పరిష్కారంలో జిల్లా పోలీసులు చొరవ తీసుకున్నారని జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా కొనియాడరు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోటవురట్ల మండలం, రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి, మొత్తం 23 కేసులలో దొంగతనమైన 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి మరియు రూ.15,000 నగదు, మొత్తము సుమారు రూ.63 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.ఈ కేసులో 5 గురు నిందితులను అరెస్ట్ చేసి, ఒక జువెనైల్‌ను జువెనైల్ హోమ్‌కు తరలించారు.ఈ నిందితులు అనకాపల్లి జిల్లాలోని తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ, రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడేవారు.వారి ఆధారంగా, నేరాల చరిత్రతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో పోలీసు శాఖ విజయవంతమైందని వివరించారు.

నిందితుల వివరాలు

ప్రధాన నిందితుడు రాజుపేట గ్రామానికి చెందిన పోలమరిశెట్టి దుర్గాప్రసాద్(24), బీశెట్టి లోకేష్,(23), యల్లపు భూపతి,(20) మడుతూరి సూర్య,(21), అలాగే మునగపాక చెందిన దొడ్డి ఆది బాబు ప్రధాన నిందితుడు బావతో పాటు రాజుపేట గ్రామానికి చెందిన ఒక జువనైల్కూడా ఉన్నారని వారందరూ అనకాపల్లి జిల్లాకి చెందినవారుగా పేర్కొన్నారు.ప్రధాన నిందితుడు పోలమరశెట్టి దుర్గాప్రసాద్, చిన్ననాటి నుంచి తండ్రి మృతి కారణంగా జులాయిగా తిరుగుతూ, చెడు వ్యసనాలకు బానిసై, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి చర్యలకు లోనై తన స్నేహితులతో కలసి ఈ చోరీలకు పాల్పడ్డాడు. దొంగలించిన బంగారాన్ని మునగపాక మండలం, జంగాల వీధికి చెందిన పోలమరిశెట్టి బావ దొడ్డి ఆది బాబు కు అప్పగించినట్టు విచారణలో వెల్లడైందన్నారు.సదరు దొడ్డి ఆదిబాబు పై ఇప్పటికే 9 మోటార్ సైకిల్ దొంగతనాల కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు.జిల్లాలో కోటవురట్ల – 6, నర్సీపట్నం రూరల్ – 3, మాకవరపాలెం – 3, కశింకోట – 3, రోలుగుంట – 2, బుచ్చెయ్యపేట – 2, యలమంచిలి రూరల్ – 2, యలమంచిలి టౌన్ – 1,నాతవరం –1 మొత్తం 23 కేసులు నమోదయ్య అన్నారు.ఈ కేసును జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా దిశానిర్దేశనలో, అదనపు ఎస్పీ క్రైమ్స్ ఎల్.మోహన రావు పర్యవేక్షణలో, సెంట్రల్ క్రైం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో, క్లూస్ టీం, ఐటీ కోర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఛేదించడం జరిగింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూఇలాంటి సంఘటనలు ప్రజలలో భయం కలిగించకుండా, అప్రమత్తతతో ఉండాలని సూచిస్తున్నాము. అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నించడం, తమ ఇంట్లో విలువైన డబ్బు, బంగారం విలువ గలవి బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలన్నారుతమ ఇళ్లకు తాళాలు వేయడమే కాకుండా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, బయటి ప్రాంతాలకు వెళ్ళేవారు స్థానిక పోలీసులతో కలిసి ఎల్.హెచ్.ఎం.ఎస్ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సేవలు వినియోగించుకోవాలన్నారు. నేరాలపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ ఎల్.మోహన్ రావు, నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్పీ పి.శ్రీనివాసరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కె.అప్పలనాయుడు, నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్.రామకృష్ణా, కోటవురట్ల ఎస్సై ఎస్.రమేష్, సిసిఎస్ ఎస్సై పి.రమేష్ ఇతర అధికారులు, సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments