Tuesday, June 17, 2025
HomePOLITICS19న విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు పలాస ఎమ్మెల్యే ,...

19న విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు పలాస ఎమ్మెల్యే , ఎచ్చెర్ల బిజెపి ఎమ్మెల్యే , చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ – ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి – పోలీసులపై అనుచిత వ్యాఖ్యల చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఎఫ్ ఐ ఆర్ కట్టాలి — తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్

పలాస:జయజయహే : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాటినం జూబ్లీ (75) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం పలాస టిడిపి ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు ఎచ్చెర్ల బిజెపి ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బి.వి.రామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళుతున్నారన్నారు. తెలుగుజాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు అని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖలోని హోటల్ దసపల్లాలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా మే 28వ తేదీన యుగపురుషుడు, అన్న నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారం గా నిర్వహించాలని ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం జిల్లాకు సీదరి అప్పలరాజు శని గ్రహం – కొండలను గుట్టలను మింగిన సీదరి అప్పలరాజు

వైసీపీ అరాచక పరిపాలనలో అప్పటి పలాస ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు అక్రమాలు అన్ని ఇన్ని కావన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం రాజధాని అవుతుందనే భ్రమను ఉత్తరాంధ్ర ప్రజలలో కల్పించారన్నారు. ఈ నేపథ్యంలోనే పలాసతో పాటు శ్రీకాకుళం ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆనాటి అక్రమాలపై భూ దందాల, కొండలను గుట్టలను మింగిన సీదరి అప్పలరాజు పై కూటమి ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఎఫ్ ఐ ఆర్ కట్టాలి

ఇదిలా ఉండగా పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని ప్రజలు దూరం చేసినప్పటికీ అతనిలో బుద్ధి రాలేదన్నారు. చివరకు శాంతి పద్ధతులను పరిరక్షించే పోలీసులనే దారుణాతి దారుణంగా దూషించడం ఎంత మాత్రం సరికాదన్నారు. పోలీసులను గుడ్డలు ఊడదీసి కొడతామని చెప్పడాన్ని బట్టి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని రామ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను గాజువాక పోలీస్ స్టేషన్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కూడా రసీదును ఇచ్చారన్నారు. అయితే తనకు కావలసింది రసీదు మాత్రమే కాదని.. వైయస్ జగన్ పై ఎఫ్ ఐ ఆర్ తెరవాలని కూటమి ప్రభుత్వ కు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments