Wednesday, June 18, 2025
HomeBHAKTIశ్రీశ్రీశ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు

శ్రీశ్రీశ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు

విశాఖపట్నం :జయజయహే : శ్రీ శ్రీ శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారిని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ,పద్మజ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి గర్భాలయంలో ఆలయ అర్చకులు పసుపు, కుంకుమతో ఎమ్మెల్యే దంపతులతో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో గాయత్రి అమ్మవారి చిత్ర పటాన్ని ,ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ప్రజలందరూ అమ్మవారి దయతో ఎటువంటి విపత్తులు, చెడు సంఘటనలు జరగకుండా ,ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పట్ల స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ బాబుకి ఆలయ ఈవో మరియు సిబ్బందిని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments